రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:34 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో యాక్షన్ అడ్వెంచర్ తరహాలో జానర్‌లో తెరకెక్కే చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గెటప్, లుక్‌ కోసం మహేశ్ మేకోవర్‌లో ఉండగా, ద్రశకుడు మాత్రం స్క్రిప్టుపై కసరత్తులు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో జనవరిలో ప్రారంభంకానున్న ఈ చిత్రం గురించి మరో వార్త వినిపిస్తోంది. మహేశ్ - రాజమౌళి సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో కొనసాగే ఈ కథను ఒకే భాగంలో చెప్పడం సాధ్యమయ్యే విధంగా లేదని రాజమౌళి అండ్ ఆయన బృందం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న ఈ చిత్రం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర యూనిట్ ముందే నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రంలో ఇండియన్ ఆర్టిస్టులతో పాటు విదేశీ నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఇండియానా జోన్స్ మాదిరిగా ఈ చిత్రం సీక్వెల్‌కు ఒకదాని తర్వాత మరొకటి వచ్చే అవకాశాలు కూడా వున్నాయని అంటున్నారు. 
 
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న విషయం తెల్సిందే. నిర్మాత కేఎల్ నారాయణ తన సొంత బ్యానర్ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా రూపొందించి విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments