Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆట సూస్తావా.." అంటున్న మహేశ్ బాబు.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (09:11 IST)
సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "గుంటూరు కారం". హారిక హాసిని బ్యానరుపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో మహేశ్ బాబు మాస్ హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ చూస్తే... మాస్ హీరోగా ఇంతవరకూ మహేశ్ బాబు చేసిన సినిమాలు ఒక లెక్క .. ఈ సినిమా ఒక లెక్క అన్నట్టుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో ఆయనను చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
 
ఈ ట్రైలర్‌ను వదిలారు. మహేశ్ బాబు పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మహేశ్ బాబు సింపుల్ డైలాగ్స్ .. 'ఆట సూస్తావా' అనే ఆయన మేనరిజం .. పండు మిరపకాయలు ఆరబోసిన ప్లేస్‌లో జరిగే ఫైట్ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
 
మొత్తం మీద ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాలనే టీమ్ ప్రయత్నం ఫలించేలానే కనిపిస్తోంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసమే మహేశ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments