Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ 'సావిత్రి'లా జీవించింది... దు.సల్మాన్ ఫ్యాన్‌ను అయిపోయా... రాజమౌళి పొగడ్తలు

మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన దర్శక ధీరుడు రాజమౌళి నటీమణులు కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడనీ, సావిత్ర

Webdunia
బుధవారం, 9 మే 2018 (15:15 IST)
మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన దర్శక ధీరుడు రాజమౌళి నటీమణులు కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడనీ, సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసిందంటూ ట్వీట్ చేశారు. దుల్కర్ సల్మాన్ నటన చూసి తను ఆయనకు అభిమానిని అయిపోయానంటూ వెల్లడించారు. మహానటి సావిత్రి గారిలా కీర్తి సురేష్ నటన అద్భుతంగా వుందని కొనియాడారు.
 
ఇకపోతే.. మహానటికి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు ఆడియెన్స్ చెపుతున్నారు. అవార్డుకు అర్హత కలిగిన చిత్రంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడుగా నాగ అశ్విని మంచి చిత్రాన్ని తీశారనీ, కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ నటన అద్భుతంగా వున్నదంటూ కితాబిస్తున్నారు. ఈ చిత్రం రేటింగ్ 3.75/5 అంటూ పేర్కొనడం గమనార్హం. 
 
యూఎస్‌లో ఇప్పటికే ఈ చిత్రం $230k వసూలు చేసింది. మిలియన్ డాలర్ల క్లబ్బులోకి ప్రవేశిస్తుందంటూ రిపోర్టులు చెపుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి మెగా నిర్మాత అశ్వినీ దత్ అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహించగా, దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments