Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రీతనయులు నటించిన "మహాన్" ట్రైలర్ రిలీజ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:35 IST)
విలక్షణ నటుడు విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన చిత్రం "మహాన్". కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. తమిళంలో మహాన్ పేరు పెట్టగా, తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేయనున్నారు. నిజజీవితంలో తండ్రీతనయులైన విక్రమ్, ధృవ్ విక్రమ్‌లు ఈ చిత్రంలో కూడా తండ్రీ తనయులుగా నటించారు. 
 
దీంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆనందపడ్డారు. అయితే, వారి ఆశలను అడియాశలు అయ్యాయి. ఈ చిత్రాన్ని థియేటర్‌‍లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నెల 10వ తేదీన అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. ఇందులోభాగంగానే ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో వాణీ భోజన్, సిమ్రాన్‌లు హీరోయిన్లుగా నటించగా, బాబీ సింహా కీలక పాత్రను పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మాత లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments