Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి గ్లామర్ : లోక్‌సభ బరిలో మాధూరీ దీక్షిత్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:12 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం బాలీవుడ్ గ్లామర్ జోడిస్తోంది. ఇందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో అనేక మంది బాలీవుడ్ సినీ ప్రముఖులను బరిలోకిదించాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసం అవసరమైన క్షేత్రస్థాయి కసరత్తు కూడా చేస్తోంది. 
 
ఆ పార్టీ తరపున ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఎంపీలుగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరికొంతమందికి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పలువురు బాలీవుడ్ అందాల భామ మాధురీ దీక్షిత్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ చీఫ్ అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. 
 
నిజానికి ఈ యేడాది జూన్ నెలలో "సంపర్క్ ఫర్ సమర్థన్" అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ముంబైకు వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధూరీ దీక్షిత్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును వచ్చే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మృతి

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments