Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ సినిమాపై బయోపిక్: సమర్పకుడిగా మారిన రాజమౌళి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:36 IST)
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా మారనున్నారు. ఇండియన్ సినిమాపై వస్తున్న బయోపిక్‌కు ఆయన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఇండియన్ సినిమా మూలం ఏమిటనే కథతో 'మేడ్ ఇన్ ఇండియా' సినిమా తెరకెక్కబోతోంది. 
 
భారత సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే గురించి ఇందులో చూపబోతున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తాలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రానుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... కథ విన్న వెంటనే ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్‌ను నిర్మించడమంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారమన్నారు.
 
ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

TDP: ఇకపై ఎవరు పడితే వారు టీడీపీలో చేరలేరు.. దానికంటూ...?

హనీమూన్‌లో భర్త హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments