Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా' ఎన్నికల్లో ఓటు వేయని ప్రముఖులు.. సమంత, రకుల్ అందుకే రాలేదు

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:48 IST)
మా ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కును వినియోగం చేసుకోలేదు. మా.. ఎన్నికలు ఈసారి చాలా టఫ్‌గా జరిగాయి. రెండు ప్యానళ్లు పోటాపోటీగా ప్రచారం చేశాయి. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా గురిపెట్టాయి. చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి కూడా సభ్యులను రమ్మని, ఓటేయమని ఆహ్వానించాయి. దీంతో భారీ స్థాయిలో తారలంతా తరలివచ్చారు. మా చరిత్రలోనే ఎక్కువగా పోలింగ్ నమోదై రికార్డ్ సృష్టించింది. కానీ ఇంత హడావుడిలోనూ చాలామంది స్టార్లు ఓటేయడానికి రాలేదు.
 
ఓటయడానికి రాని హీరోల లిస్టు చూస్తే.. వెంకటేశ్, రానా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రవితేజ, నాగచైతన్య, నితిన్, సుమంత్, నాగశౌర్య, సునీల్ ఉన్నారు. దీంతో వీళ్లను చూడడానికి దూరాభారాలు లెక్కేయకుండా పోలింగ్ బూత్ దగ్గర పడిగాపులు పడ్డ అభిమానులకు నిరాశ తప్పలేదు.
 
ఓటేయడానికి రాని హీరోయిన్లు ఎవరంటే.. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, అనుష్క ఉన్నారు. వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు కావడంతో ఆమె వస్తుందని చెప్పలేం. సమంత విడాకుల వ్యవహారం వల్ల రాలేకపోయిందని టాక్. మరి తమన్నా, అనుష్క సంగతేంటి? కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల, మరికొందరు షూటింగుల్లో ఉండడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments