Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చిరంజీవి పిలుపు - అయినా కొన్ని చోట్ల సగం మాత్రమే పోలింగ్

డీవీ
సోమవారం, 13 మే 2024 (18:29 IST)
chiru at jublihills poling booth
ప్రస్తుతం ఆంధ్రపదేశ్ లోనూ, తెలంగాణాలో నూ జరుగుతున్న అసెంబ్లీ, ఎం.పి. ఎలక్షన్ల లో ప్రతి ఒక్కరు ఓటు వేసి బాధ్యతాయుతంగా పౌర కర్తవ్యాన్ని పూర్తి చేయాలని చిరంజీవి కోరారు. సోమవారంనాడు మెగా స్టార్ చిరంజీవి, భార్య సురేఖ, కూతురు సుస్మితతో కలిసి జూబ్లీ క్లబ్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
balakrishna, vasundhara
అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో ఓటు వేసి ప్రజాస్వామ్యం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు.
ఇంకోవైపు  *జూబ్లీ క్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకోవాడానికి వచ్చిన రామ్ చరణ్ , ఉపాసన దంపతులు ఓటు వేశాక అందరూ ఓటు వేయాలని కోరారు.
 
Mahesh, namrata
ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో హీరో మహేష్ బాబు,  భార్య నమ్రత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ప్రతి ప్రముఖులు ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, హైదరాబాద్ లోని పలుచోట్ల సగానికి మాత్రమే ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. 
 
మణికొండ ఏరియాలోని పలుబూత్ లలో నలభై ఐదు శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. సిటీలోని యూత్ అంతా పలు ప్రాంతాలకు తమ ఊళ్ళకు వెళ్ళారని అందుకే యూత్ ఓటింగ్ పలచగా వుందని అధికారు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments