Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం కోసం స్నేహితుడికి ఫోన్ చేస్తే.. 11 మందిని పంపి అత్యాచారం చేయించాడు...

ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు.

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (11:59 IST)
ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్‌లోని లాహోర్‌దగాకు సమీపంలోని సర్దార్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై లాహోర్‌దగా నుంచి మరో ప్రాంతానికి బయలుదేరారు.


అయితే, వీరి వాహనం మధ్యలో చెడిపోయింది. దీంతో ఆ బాలికలు సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడి ఫోన్ చేశారు. ఇదే అదునుగా భావించిన అతడు.. తన 11 మంది స్నేహితులను ఆ ప్రాంతానికి పంపించాడు.
 
అక్కడికి చేరుకున్న 11 మంది బాలికలతో ఉన్న వ్యక్తిని చితకబాది.. మైనర్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈనెల 16వ తేదీన జరిగింది. ఈ ఘటనపై బాధితురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న వారేనని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments