Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం కోసం స్నేహితుడికి ఫోన్ చేస్తే.. 11 మందిని పంపి అత్యాచారం చేయించాడు...

ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు.

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (11:59 IST)
ఇద్దరు బాలికలపై 11 మంది సామూహిక అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అదీకూడా సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేస్తే.. అతను 11 మంది స్నేహితులను పంపించి రేప్ చేయించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్‌లోని లాహోర్‌దగాకు సమీపంలోని సర్దార్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై లాహోర్‌దగా నుంచి మరో ప్రాంతానికి బయలుదేరారు.


అయితే, వీరి వాహనం మధ్యలో చెడిపోయింది. దీంతో ఆ బాలికలు సాయం కోసం తమకు తెలిసిన స్నేహితుడి ఫోన్ చేశారు. ఇదే అదునుగా భావించిన అతడు.. తన 11 మంది స్నేహితులను ఆ ప్రాంతానికి పంపించాడు.
 
అక్కడికి చేరుకున్న 11 మంది బాలికలతో ఉన్న వ్యక్తిని చితకబాది.. మైనర్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈనెల 16వ తేదీన జరిగింది. ఈ ఘటనపై బాధితురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న వారేనని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments