Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (10:40 IST)
పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన "ఎల్2 ఎంపురాన్" చిత్రం వివాదాల నడుమ భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలోని అనేక సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంటూ ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో పాటు ఆందోళనకారులకు హీరో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. 
 
అయితే, ఆ చిత్ర కలెక్షన్లపై ఈ వివాదాలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఫలితంగా కేవలం నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టాయి. ఫలితంగా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ చిత్రంగా 'ఎంపురాన్' రికార్డు సృష్టించింది. గత నెల 27వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్ళు రాబడుతోంది. 
 
ఈ చిత్రంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించారనే విమర్శలు, వివాదాలు కొనసాగుతున్నప్పటికీ సినిమాకు కలెక్షన్లు పెరుగుతుండటం గమనార్హం. ఇప్పటివరకు "మంజుమ్మల్ బాయిస్" సినిమా పేరిట ఉన్న రూ.200 కోట్ల రికార్డును 'ఎంపురాన్' అధికమించింది. మున్ముందు ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాణ సంస్థ హర్షం వ్యక్తం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments