Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త బంగారు లోకం ''శ్వేతబసు''కు పెళ్లైపోయింది.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (11:05 IST)
టాలీవుడ్‌లో కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయమైన అందాల బొమ్మ శ్వేతాబసు ప్రసాద్ పెళ్లికూతురైంది. శ్వేతబసు ప్రసాద్ వివాహం పూణేలో ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతబసు ప్రసాద్ వివాహం అట్టహాసంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. 
 
బెంగాలీ సంప్రదాయం ప్రకారం శ్వేతబసు ప్రసాద్ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో గులాబీ రంగు దుస్తులతో శ్వేతబసు ప్రసాద్ మెరిసిపోయింది. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను శ్వేతాబసు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆమె భర్త రోహిత్ కూడా.. ఇక అయిపోయింది.. అంటూ తన పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 
 
కాగా మక్డీ సినిమా ద్వారా బాలనటిగా సినీ రంగంలోకి వచ్చిన శ్వేత.. ఈ సినిమా కోసం జాతీయ అవార్డును అందుకున్నారు. తెలుగులో కొత్త బంగారు లోకం, కళవర్ కింగ్ వంటి సినిమాల్లో మెరిసింది. అయితే ఆమెకు ఆశించిన స్థాయిలో హీరోయిన్ ఛాన్సులు రాలేదు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతబసు ప్రసాద్ పలు సీరియల్స్‌లో నటించింది. బుల్లితెరకే పరిమితమై మంచి పేరు కొట్టేసిన శ్వేతబసు.. ఇక ప్రేమికుడినే పెళ్లాడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచిన భర్త!!

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments