Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌పై కోట శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్.. తెలుగోడికి ప్రాముఖ్యత లేదు..

ఎన్టీఆర్‌ నటించిన ''జ‌న‌తా గ్యారేజ్'' సినిమా వ‌సూళ్లతో బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (14:29 IST)
ఎన్టీఆర్‌ నటించిన ''జ‌న‌తా గ్యారేజ్'' సినిమా వ‌సూళ్లతో బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో యలమంచిలి రవిశంకర్‌, ఎర్నేని నవీన్‌, సి.వి.మోహన్‌లు నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. అయితే ఈ చిత్రం సక్సెస్ గురించి కోట శ్రీనివాస్ సంచలన వాఖ్యలు చేశారు. 
 
ఈ చిత్రంలో తెలుగు నటీనటులుకు అవకాశాలు ఇవ్వలేందంటూ కోట ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగోడి నటనకు ప్రాముఖ్యత లేకుండా పోతుంది..ఈ మధ్య కాలంలో చాల సినిమాల్లో పరి భాష నటులను ఎంచుకుంటూ, తెలుగు నటులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు..వారికీ మాత్రమే నటన వచ్చా..? మాకు రాదా అంటూ ఘాటుగా స్పందించాడు. ''జనతా గ్యారేజ్''లో నటించిన మలయాళ నటుడు మోహన్ లాల్‌ను గురించి ప్రస్తావిస్తూ సినిమాలో మోహన్ లాల్ బాగా చేసాడు అంటున్నారు. అతను గ్రేట్ మలయాళం యాక్టర్ అతడు బాగా చెయ్యడంలో అతిశయోక్తి లేదు. 
 
అతని స్థానంలో మన తెలుగు నటుడిని పెట్టుకోవచ్చు కదా…అతనంత ధీటుగా నటించే తెలుగువాడు లేడా? అంటూ ప్రశ్నించాడు. అతన్ని పెట్టుకుని సినిమా చేసి.. బాగా చేశాడు అంటే ఎలా? మరి తెలుగువాడు ఏమైపోయాడు? అది చూపించాక తెలుగువాడు ఎంత యాక్ట్ చేస్తే నీకు ఆనతాడు?" అంటూ ప్రశ్నించారు కోట. "పనైపోతుంది కదా వాళ్ళని పెట్టుకుంటే.. తెలుగోడు భోజనం చేయనక్కర్లేదా??" అంటూ తనదైన శైలిలో ఘాటైన కామెంట్స్ చేశారు కోట. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకువచ్చిన జనతాగ్యారేజ్ వసూళ్లపరంగా రికార్డులను క్రియేట్‌చేస్తోంది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments