Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలు నేను గత జన్మలో సోదరులం : కేజే.ఏసుదాస్

Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (15:53 IST)
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో పాటు సంగీత సామాజ్రంలో కలిసి ప్రయాణించినవారిలో కేజే ఏసుదాస్ ఒకరు. వీరిద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఏసుదాస్‌ను బాలు తన గురువుగా, తండ్రిగా భావిస్తుంటారు. అందుకే ఓ సందర్భంగా ఏసుదాస్‌కు ఎస్పీ బాలు దంపతులు పాదపూజ చేశారు. అలాంటి బాలు ఇటీవలే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన ఏసుదాస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలును చివరి సారి చూసుకోలేకపోయానని తన బాధను వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఏసుదాస్... కరోనా నేపథ్యంలో భారత్‌కు రావడానికి అనుమతి ఇవ్వడం లేదని, బాలు కడచూపుకు నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. బాలు ఎప్పటికీ తన జ్ఞాపకాల్లో ఉంటారని చెప్పారు. బాలు తన సొంత సోదరుడికంటే ఎక్కువని చెప్పారు. 
 
తామిద్దరం ఎన్నో ఏళ్లు బాలుతో కలిసి ప్రయాణం చేశానని... తనతో పని చేసిన అందరి కంటే బాలునే తనకు ఎక్కువని అన్నారు. సంగీతాన్ని సాంప్రదాయబద్దంగా నేర్చుకోకపోయినా ఈ రంగంలో ఎంతో నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు. 
 
పాడటమే కాకుండా, సంగీతాన్ని చక్కగా కంపోజ్ చేస్తారని అన్నారు. సంగీతంలో శిక్షణ పొందిన వారు కూడా ఇంత గొప్పగా పాడలేరని అన్నారు. తామిద్దరం గత జన్మలో సోదరులమనుకుంటానని చెప్పారు. బాలు ఎవరినీ బాధించలేదని, అందరినీ ప్రేమతో పలకరించేవారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments