Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ నం.150' సాంగ్ : 24 గంటల్లో 20 లక్షల మంది వీక్షించారు... చాలా థ్యాంక్స్ : డీఎస్పీ

సుదీర్ఘకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రంలోని టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు. 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' అనే పాటను ఆదివారం స

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (11:26 IST)
సుదీర్ఘకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రంలోని టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు. 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' అనే పాటను ఆదివారం సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. 
 
ఈ పాట విడుదల చేసిన 24 గంటల్లో 20 లక్షల వ్యూస్ సాధించిందని ఆ చిత్రబృందం ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన ఈ పాట అభిమానులను విశేషంగా అలరించిందని, దీనికి కేవలం 24 గంటల్లోనే 20 లక్షల వ్యూస్ వచ్చాయని ఈ చిత్రబృందం తెలిపింది. 24 గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ సాధించిన సినిమాపాట కూడా ఇదేనని కూడా ఆ చిత్రయూనిట్ పేర్కొంది. ఇంత పెద్ద ఘనత సాధించేందుకు కారణమైన అభిమానులకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ధన్యవాదాలు తెలిపాడు. 
 
కాగా, 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' పాటను ఆలపించింది దేవీశ్రీప్రసాద్, రాణినారెడ్డి. కొణిదెల పతాకంపై చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానుంది. 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments