Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్‌ పవన్‌కి చెర్రీ ధన్యవాదాలు: ఎన్టీఆర్, మహేష్‌లకు చెర్రీ చాలా క్లోజ్.. అఖిల్ ఐతే?: చిరు

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (14:23 IST)
ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వారా రామ్‌చరణ్‌కు, వదిన సురేఖకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
పవన్‌ హాజరుకాకపోవడంపై మీడియా, అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నప్పటికీ చిరంజీవి, రామ్‌చరణ్‌ మాత్రం పాజిటివ్‌ కామెంట్లే చేస్తున్నారు. కేవలం బిజీగా ఉండడం వల్లే పవన్‌ రాలేకపోయాడని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చెర్రీ కూడా బాబాయ్‌కి వత్తాసు పలికాడు. ఇందులో భాగంగా చెర్రీ సోషల్‌ మీడియా ద్వారా పవన్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. తమకు శుభాకాంక్షలు చెబుతూ పవన్‌ చేసిన ట్వీట్‌కు రామ్‌చరణ్‌ ధన్యవాదాలు తెలియజేశాడు.
 
ఇదిలా ఉంటే.. అభిమానులు, బయటివాళ్లు ఎలా అనుకుంటున్నా సినిమా వాళ్లంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారని మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తోటి హీరోలతో తనకు మంచి అనుబంధం ఉందని.. ఈ సంక్రాంతికే విడుదలవుతున్న 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రారంభోత్సవానికి తాను వెళ్లానని గుర్తు చేశారు.
 
అలాగే నాగార్జున, వెంకటేష్‌లతోనూ తనకు మంచి అనుబంధముందని చిరంజీవి వెల్లడించారు. తనలాగానే రామ్‌చరణ్‌ కూడా తోటి కథానాయకులందరితోనూ స్నేహంగా ఉంటాడన్నారు. మహేష్‌ బాబుకి చెర్రీ చాలా క్లోజ్ అని, వారి ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్లాడని చిరంజీవి అన్నారు. ఇక ఎన్టీఆర్‌కు కూడా చెర్రీ మంచి ఫ్రెండ్ అని తెలిపారు. అఖిల్‌ అయితే చరణ్‌తో టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు ఇంటికి వస్తుంటాడని అన్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments