Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్‌ పవన్‌కి చెర్రీ ధన్యవాదాలు: ఎన్టీఆర్, మహేష్‌లకు చెర్రీ చాలా క్లోజ్.. అఖిల్ ఐతే?: చిరు

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (14:23 IST)
ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వారా రామ్‌చరణ్‌కు, వదిన సురేఖకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
పవన్‌ హాజరుకాకపోవడంపై మీడియా, అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నప్పటికీ చిరంజీవి, రామ్‌చరణ్‌ మాత్రం పాజిటివ్‌ కామెంట్లే చేస్తున్నారు. కేవలం బిజీగా ఉండడం వల్లే పవన్‌ రాలేకపోయాడని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చెర్రీ కూడా బాబాయ్‌కి వత్తాసు పలికాడు. ఇందులో భాగంగా చెర్రీ సోషల్‌ మీడియా ద్వారా పవన్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. తమకు శుభాకాంక్షలు చెబుతూ పవన్‌ చేసిన ట్వీట్‌కు రామ్‌చరణ్‌ ధన్యవాదాలు తెలియజేశాడు.
 
ఇదిలా ఉంటే.. అభిమానులు, బయటివాళ్లు ఎలా అనుకుంటున్నా సినిమా వాళ్లంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారని మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తోటి హీరోలతో తనకు మంచి అనుబంధం ఉందని.. ఈ సంక్రాంతికే విడుదలవుతున్న 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రారంభోత్సవానికి తాను వెళ్లానని గుర్తు చేశారు.
 
అలాగే నాగార్జున, వెంకటేష్‌లతోనూ తనకు మంచి అనుబంధముందని చిరంజీవి వెల్లడించారు. తనలాగానే రామ్‌చరణ్‌ కూడా తోటి కథానాయకులందరితోనూ స్నేహంగా ఉంటాడన్నారు. మహేష్‌ బాబుకి చెర్రీ చాలా క్లోజ్ అని, వారి ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్లాడని చిరంజీవి అన్నారు. ఇక ఎన్టీఆర్‌కు కూడా చెర్రీ మంచి ఫ్రెండ్ అని తెలిపారు. అఖిల్‌ అయితే చరణ్‌తో టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు ఇంటికి వస్తుంటాడని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments