Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తిసురేష్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. అజయ్ కోసం బక్కపలుచగా..?!

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (13:33 IST)
మహానటి బయోపిక్‌లో సావిత్రి పాత్రధారిగా కనిపించిన హీరోయిన్ కీర్తిసురేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో నటనకు కీర్తి సురేష్‌ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తి సురేష్ ఈ పురస్కారం అందుకోనుంది. 
 
ఈ అవార్డు అందుకోనే లోపే కీర్తి సురేష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓనం పండగ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీర్తి సురేష్‌ను ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు ''మిస్ ఇండియా'' చిత్రంలో నటిస్తోంది. 
 
అంతేకాకుండా బోనీ కపూర్ నిర్మాణంలో అజయ్ దేవ్‌గన్ సరసన నటిస్తున్న చిత్రానికి గాను కీర్తి పూర్తిగా మారిపోయింది. దీంతో సన్నగా మారిన కీర్తి ఫోటోస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments