Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ హీరోయిన్ ఫిక్స్, ఇంతకీ ఎవరు..?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:34 IST)
సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించిన మహేష్‌ బాబు ఆతర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారడం.. ఆఖరికి గీత గోవిందం సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన పరశురామ్‌తో సినిమా ఎనౌన్స్ చేయడం తెలిసిందే. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
 
షూటింగ్‌లు స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వడంతో ఇక షూటింగ్‌లు స్టార్ట్ అవుతాయి అనుకున్నారు కానీ.. స్టార్ హీరోలు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్టు చాన్నాళ్లు ప్రచారం జరిగింది.
 
గతంలో మహేష్ సరసన నటించిన కైరా అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది. దాదాపుగా ఈమె పేరు కన్ఫర్మ్ అనుకున్నారు కానీ... ఆ తర్వాత కైరా అద్వానీ కాదు అని తెలిసింది. తాజా వార్త ఏంటంటే... మహానటి సినిమాతో జాతీయ అవార్డ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్‌ మహేష్‌ సరసన నటించనున్నది. ఈమె పేరు కూడా బాగా వినిపించింది.
 
అయితే... సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చాట్ చేసిన కీర్తి సురేష్‌ .. మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటించనున్నట్టు కన్ఫర్మ్ చేసింది. మహేష్‌ - కీర్తి సురేష్‌ జంట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments