Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ బయోపిక్: జగన్ సతీమణి భారతి పాత్రలో కీర్తి సురేష్?

టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతుంది. ఇందులో టాప్ హీరోయిన్ నయనతార వైఎస్సార్ సతీమణిగా, కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (11:02 IST)
టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతుంది. ఇందులో టాప్ హీరోయిన్ నయనతార వైఎస్సార్ సతీమణిగా, కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ బయోపిక్‌‌లో జగన్ భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.

ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య చేయనున్నట్లు సమాచారం. 
 
ఇక జగన్ భార్య భారతి పాత్రలో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని.. విజయ్ చిల్లా.. దేవిరెడ్డి శశి ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఇకపోతే.. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ పాదయాత్ర నుంచి.. సీఎం పదవి చేపట్టేవరకు ఈ కథ కొనసాగుతుందని సినీ జనం అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments