Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే రాజమౌళి అంత ఎత్తున ఉన్నాడు: ఆకాశానికెత్తిన కీరవాణి

రాజమౌళికి నేను బెస్ట్‌ మ్యూజిక్‌ ఇవ్వడానికి కారణం అతను తన మాట వింటాడు అని స్పష్టం చేసారు కీరవాణి. రాజమౌళికి పని పట్ల భక్తి, ప్రేమ ఉన్నంత వరకూ అతని స్టాండర్డ్స్‌ను ఎవరూ చేరుకోలేరు. ఇది వంద శాతం నిజం. ఇది నా వేదవాక్కు అని కీరవాణి జోస్యం చెప్పారు.

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (09:27 IST)
బాహుబలి2 సినిమా ముగిసిన తర్వాత చలన చిత్రాలకు సంగీత దర్శకత్వం మానేస్తానని ముందే ప్రకటించిన ఎంఎం కీరవాణి అన్నంత పనీ చేశారు. ఆదివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి2 ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగడానికి ముందు ట్విట్టర్‌లో తన రిటైర్మెంటును కీరవాణి ప్రకటించగానే సంచలనం కలిగింది. తర్వాత ఎవరి ఒత్తిడి వల్లనో ఏమో కానీ నా సొంత నిబంధనల మేరకే స్వరకర్తగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని  తన నిర్ణయాన్ని మార్చుకున్నారు కీరవాణి. 27 సంవత్సరాలుగా సంగీత దర్శకత్వంలో తలపండిపోయిన కీరవాణి తెలుగు చిత్రపరిశ్రమలో బుర్ర తక్కువ దర్శకుల కారణంగానే ఇకపై సంగీత దర్శకత్వం వహించలేనని చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన కారణం షాక్ కలిగించింది.
 
సంగీత దర్శకుడు తన ఆధీనంలో ఉండడు అనే ఆలోచననే ఏ దర్శకుడూ ఇష్టపడడు కాబట్టి తెలుగు సినిమా దర్శకుల వద్ద  పనిచేయడం చాలా కష్టం అంటూ కీరవాణి ధ్వజమెత్తారు. పైగా తాను పనిచేసిన దర్శకుల్లో కొందరు మూగ, చెవిటి అంటూ విమర్శించారు. చాలావరకు తాను బుర్ర తక్కువ దర్శకులతోనే పనిచేశానని, వాళ్లు తన మాటలు వినేవారు కాదని కీరవాణి చెప్పారు. దర్శకులు తనను ఓ సంగీత దర్శకుణ్ణి మాత్రమే అనుకుని, మంచి సలహా ఇచ్చినా తీసుకోరన్నారు. కథ వినేటప్పుడే నేను సంగీత దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు ఫ్లాప్‌ అవుతాయని ఊహించా అంటూ తన చేదు అనుభవాలను విప్పి చెప్పారు కీరవాణి,.  అందుకే తన శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఇంకొన్నాళ్లు సంగీత దర్శకుడిగా కొనసాగితే... మాట వినని, మాట్లాడని దర్శకులతో ప్రయాణించనని కరాఖండిగా చెప్పేశారు.
 
అదే సమయంలో రాజమౌళిని కీరవాణి ఆకాశానికి ఎత్తేశారు. రాజమౌళికి నేను బెస్ట్‌ మ్యూజిక్‌ ఇవ్వడానికి కారణం అతను తన మాట వింటాడు అని స్పష్టం చేసారు కీరవాణి. రాజమౌళికి పని పట్ల భక్తి, ప్రేమ ఉన్నంత వరకూ అతని స్టాండర్డ్స్‌ను ఎవరూ చేరుకోలేరు. ఇది వంద శాతం నిజం. ఇది నా వేదవాక్కు అని కీరవాణి జోస్యం చెప్పారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments