Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ కోసం చెన్నై వెళుతూ రోడ్డు ప్రమాదం... టీవీ నటి దుర్మరణం...

కర్నాటక రాష్ట్రానికి చెందిన టీవీ నటి దుర్మరణం చెందింది. షూటింగ్ కోసం చెన్నైకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్‌

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (13:46 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన టీవీ నటి దుర్మరణం చెందింది. షూటింగ్ కోసం చెన్నైకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని సున్నంపకొట్టయ్‌ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే కన్నడ బుల్లితెర నటిగా రేఖా సింధు మంచి పేరు తెచ్చుకుంది. ఈమెతో పాటు మరో నలుగురు కలిసి కారులో బెంగుళూరు నుంచి చెన్నైకు వెళుతున్నారు. ఈ కారు చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలైంది. 
 
ప్రమాదంలో చనిపోయిన మిగతా ముగ్గురిని అభిషేక్‌ కుమారన్‌ (22), జయకంద్రన్ ‌(23), రక్షణ్ ‌(20)గా గుర్తించారు. మృతదేహాలను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వేలూరు ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆరుగురు ఉన్నారని వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరినీ వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments