ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓ మూగ గదిగా పేర్కొన్న కంగనా (video)

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (14:27 IST)
సోషల్ మీడియా ఖాతాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాను ఒక మూగ గదితో పోల్చారు. నిన్న ఏం రాశామో నేడు అది కనిపించదంటూ వ్యాఖ్యానించారు. తామేమి మాట్లాడామో అర్థంకాని వారికి సరైన వేదిక అంటూ సెటైర్లు వేశారు. అదేసమయంలో ట్విట్టర్ గొప్ప సామాజిక వేదిక అంటూ ప్రశంసలు  కురిపించారు. 
 
కాగా, గతంలో కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె ట్విట్టర్ ఖాతాను గత 2021 మే నెల నుంచి నిషేధం విధించారు. ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ చర్య ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా తన వాణిని వినిపించాల్సి వస్తుంది. ఇదేమంత ప్రభావవంతమైనది కాదని అభిప్రాయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. 
 
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మూగబోయిన గది కింద లెక్కగట్టేశారు. ఇన్‌స్టా అంతా ఫోటోల మయమేనని గుర్తుచేశారు. అలాగే, ట్విట్టర్ కూడా ఉత్తమ సోషల్ మీడియా వేదిక కాదంటూ వ్యాఖ్యానించారు. మేధోపరంగా సైద్ధాంతిక పరంగా ప్రేరేపించేదంటూ వ్యాఖ్యానించారు. 
 
అయితే, ట్విట్టర్ ఇపుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి చేరింది. ట్విట్టర్ పాలసీ తర్వాత నిషేధానికి గురైన ఖాతాలను అనుమతిస్తామంటూ ఆయన ఇటీవల ప్రకటించడంతో కంగనా రనౌత్ ఖాతా తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

విజయ్ నేరుగా వచ్చి పరామర్శించలేదు.. రూ.20లక్షలు తిప్పి పంపిన కరూర్ బాధితురాలు

అంటు వ్యాధులు ప్రబలుతాయ్.. తస్మాత్ జాగ్రత్త : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments