Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ షాక్ : ఎమర్జెన్సీ మూవీపై నిషేధం!

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (13:54 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ పాలకులు షాకివ్వనున్నారు. ఆమె ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ నెల 17వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఒక్క భారత్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ చిత్రం విడుదల కాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించాలన్న తలంపులో ఉంది. 
 
ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కంగనా రనౌత్ నిర్మించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషించగా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయస్ తల్పాడే కనిపించనున్నారు.
 
మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలనే యోచనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత... భారత్ - బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఎమర్జెన్సీ' మూవీని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments