కంగనా రనౌత్ స్వేచ్ఛను హరించలేం .. బాంబే హైకోర్టు

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:41 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టు నుంచి ఊరట లభించింది. కంగనా ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. పైగా, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరకీ ఉంటుందని అభిప్రాయపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ట్విట్టర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలను కంగనా చేస్తోందని, తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందని అలీ ఖాసిఫ్ ఖాన్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కంగనాకు ఊరటను కల్పించింది. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని తాము ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. 
 
ట్విట్టర్‌లో ఎవరికైనా ఖాతా ఉండొచ్చని, అందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అందరికీ ఉంటుందని చెప్పింది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను జాతి వ్యతిరేక వ్యాఖ్యలని చెప్పలేమని వ్యాఖ్యానించింది. తీర్పును జనవరి 7న వెలువరిస్తామని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

హెచ్1బీ వీసా ఎఫెక్ట్: ఎన్నారై వరుడి డిమాండ్ తగ్గింది.. అమెరికా సంబంధాలొద్దు: భారతీయులు

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

తిరుపతి ఎస్వీ జూపార్క్ టైమ్ స్కైల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ... సెల్ఫీ వీడియో

అత్తారింటికి తరచూ వెళ్లే అల్లుడు.. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు.. భార్య అడిగిందని చంపేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments