వరుసగా చిరంజీవి వారసుల చిత్రాల ముహూర్తాలు జరుగుతున్నాయి. అలాగే ఈ శుక్రవారమే నందమూరి కల్యాణ్ రామ్ కూడా సిద్ధమవుతున్నాడు. పూరీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను, కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ పైన నిర్మించనున్నాడు. మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరపాలనే ఆలోచనలో వున్నారు.
ఇందులో కల్యాణ్ రామ్ పవర్ఫుల్ జర్నలిస్ట్గా కనిపించనున్నాడు. ఆయన పాత్రను పూరీ జగన్నాథ్ వైవిధ్యభరితంగా మలిచాడనీ, అందువలన కల్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. 'షేర్' తరువాత కల్యాణ్ రామ్ చేస్తోన్న సినిమా ఇదే.