Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌ను చేయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ గురించి క‌ళ్యాణ్ రామ్ ఏమ‌న్నారంటే...?

టాలీవుడ్‌లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా ద‌గ్గ‌ర నుంచి మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైంది. ఆత‌ర్వాత వెంకీ - ప‌వ‌న్ క‌లిసి 'గోపాల గోపాల' సినిమా చేసారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి మ‌నం సినిమా చేసారు. ఇక నంద‌మూరి హీరోల మ‌ల్టీస్టా

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (12:47 IST)
టాలీవుడ్‌లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా ద‌గ్గ‌ర నుంచి మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైంది. ఆత‌ర్వాత వెంకీ - ప‌వ‌న్ క‌లిసి 'గోపాల గోపాల' సినిమా చేసారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి మ‌నం సినిమా చేసారు. ఇక నంద‌మూరి హీరోల మ‌ల్టీస్టార‌ర్ కూడా రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇందులో హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్ కూడా న‌టిస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.
 
కానీ... ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం నా నువ్వే. ఈ చిత్రం ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన క‌ళ్యాణ్ రామ్ త‌ను చేయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ గురించి కూడా చెప్పాడు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే.. ఇందులో న‌టించేందుకు ముగ్గురు న‌లుగురు హీరోల‌ను అనుకుంటున్నాం కానీ.. ఎవ‌రనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు అన్నారు. 
 
హీరోలు ఎవ‌ర‌నేది ఖ‌రారు అయిన త‌ర్వాత అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తామ‌ని తెలియ‌చేసారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments