ముంబై: కబాలీ సినిమా విడుదలకు ముందే స్పెషల్ ఫ్లైట్లు గగనతలంలో హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో రజనీకాంత్ ప్రచారం మారుమోగిపోతోంది. రజనీ అభిమానులకు ఎయిర్ ఏషియా కబాలి ఆఫర్ ఇచ్చింది. కబాలి ఫస్ట్ షోతో బెంగళూరు నుంచి చెన్నైకు జులై 15న బయలుదేరుతోంది. ఆ రోజు ఉదయం 6.10కి బెంగళూరు నుంచి బయలుదేరి చెన్నైకి ఫ్లైట్ గం. 7.10 నిమిషాలకు చేరుతుంది.
తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, 4 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. దీని ధర 7,860 రూపాయలు నిర్ణయించారు. ఫ్లైట్ టిక్కెట్టుతో పాటు కబాలి మూవీ టిక్కెట్, ఆడియో సీడీ, బ్రేక ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్... ఇవి కాక చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి సినిమా థియేటర్కు రవాణా ఛార్జీలు కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం డిజైన్ చేసిన కబాలి స్పెషల్ ఫ్లైట్ ఇపుడు ముంబై, చెన్నై, ఢిల్లీ ఎయిరోడ్రోమ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి కబాలి హంగామా ఎలా ఉంటుందో చూడాల్సిందే.