Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెళ్ళి సందడి' మళ్లీ మొదలవ్వబోతుంది.. (video)

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (14:39 IST)
టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు మూడేళ్ళ విరామం తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి పెళ్లి సందడి అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో అంటూ ఓ ట్వీట్ చేశారు.
 
గత 1996లో శ్రీకాంత్ హీరోగా పెళ్లి సందడి చిత్రాన్ని రాఘవేంద్ర రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది. చిన్న తారాగణంతో కె.రాఘవేంద్రరావు ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అప్పటివరకు అంతగా పేరులోని శ్రీకాంత్... ఆ చిత్రం తర్వాత హీరోగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇపుడు ఇదే పేరుతో కొత్తగా చిత్రాన్ని నిర్మించనున్నారు. 
 
నిజానికి గత మూడేళ్లుగా ఆయన దర్శకత్వ శాఖకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కొత్త చిత్రం గురించి ప్రకటన చేస్తానని రాఘవేంద్రరావు గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. చెప్పినట్లే ఆయన కొత్త సినిమా పేరును ప్రకటించారు. 'పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో...' అని తెలిపారు. 
 
అంటే తన కొత్త సినిమా పేరు పెళ్లి సందడి అని, ఇందులో నటించే వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. కె.కృష్ణ‌ మోహన్ రావు సమర్పణలో, ఎంఎం కీరవాణి సంగీతంతో ఈ సినిమా రానుందని ఆయన చెప్పారు. ఈ సినిమాకు గేయ రచయిత చంద్రబోస్ పాటలు రాయనున్నారని తెలిపారు. 
 
ఇదిలావుంటే, పెళ్లి సందడి టైటిల్‌తో కె.రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు వెలువడిన ప్రకటన టాలీవుడ్‌లో ఓ సంచలనమైంది. ఇక ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారంటూ టాలీవుడ్‌లో అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ పేరు బాగా వినిపిస్తోంది. ఆమధ్య నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.
 
ఈ కొత్త 'పెళ్లిసందడి'కి రోషన్‌ని కె.రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్‌కు ఆ 'పెళ్లిసందడి' ఎంతగా హెల్ప్ అయిందో.. ఇప్పుడు రోషన్ కెరీర్ కు ఈ 'పెళ్లిసందడి' కూడా అంతగానూ హెల్ప్ అవుతుందని చెప్పచ్చు!

 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments