మహేష్ హీరోయిన్‌ను లైన్లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్!

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:14 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఇపుడు ఈ భామకు మరో టాలీవుడ్ స్టార్‌తో నటించే లక్కీ ఛాన్స్ వరించింది. 
 
హీరో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న 'ఆచార్య' .. చిత్రీకరణ పరంగా చివరిదశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తయిన తర్వాతనే ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. 
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందనీ, ఇంతవరకూ ఎన్టీఆర్ ఈ తరహా పాత్రను చేయలేదని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.
 
కొరటాల ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉండటం వలన, ఈ సినిమా కోసం కియారా అద్వానిని గానీ .. రష్మికనుగాని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. 
 
అయితే, 'భరత్ అనే నేను'తో కియారాకు కొరటాల పెద్ద హిట్ ఇచ్చాడు. అందువలన ఆయన సంప్రదిస్తే ఆమె కాదనకపోవచ్చనే టాక్ వినిపించింది. అందుకే ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించే అవకాశాలే ఎక్కువన్న టాక్ ఫిల్మ్ సిటీలో వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments