Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భీమ్'' విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన చిరు.. సవాల్ ఎవరికంటే?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:55 IST)
Chiru
లాక్ డౌన్ కారణంగా సినీ ప్రముఖులు ఇంట్లోనే వుంటున్నారు. ఇందులో భాగంగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా 'బీ ది రియల్ మెన్' అనే ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టారు. దీనికి నెటిజన్ల నుండి సినీ పరిశ్రమ నుండి మంచి స్పందన వస్తుంది. లాక్‌డౌన్ వలన పని మనుషులు రాకపోవడంతో మహిళలు ఇంటి పనులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 
 
ఈ సమయంలో ఇంటి పనులలో మనం పాలు పంచుకోవాలని సందీప్ ఈ ఛాలెంజ్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ని రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, సుకుమార్, కొరటాల శివ వంటి వారు స్వీకరించగా.. తాజాగా ఎన్టీఆర్ విసిరినా సవాల్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించారు. ఇల్లు శుభ్రం చేసి తన చేత్తో దోసె వేసి తన తల్లి అంజనాదేవికి పెట్టారు. ఈ సందర్భంగా అంజనాదేవి.. చిరుకు దోశె తినిపించారు. 
 
'భీమ్‌(తారక్‌) ఇదిగో చూడు.. నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం. ఈ వీడియో సాక్ష్యం' అని చిరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు కేటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లను నామినేట్ చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments