Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఘటనపై Jr. ఎన్టీఆర్!.. ఇక ఆ సంస్కృతిని ఆపేద్దాం..

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (16:15 IST)
అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానించారని.. ప్రెస్ మీట్‌లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. ఈ ఘటనపై బాబుకు పలువురు సంఘీభావం చెప్తున్నారు. అంతేగాకుండా నందమూరి ఫ్యామిలీ ఆయనకు వెన్నంటి వుండి.. ఈ చర్యకు తీవ్రంగా ఖండించింది.

తాజాగా అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని గుర్తు చేశారు. మన నవనాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సాంప్రదాయం అది అని చెప్పారు. 
 
మన సాంప్రదాయాలను జాగ్రత్తగా, భద్రంగా రాబోయే తరాలకు అప్పజెప్పాలే కానీ... మన సంస్కృతిని కాల్చివేస్తూ రాబోతే తరానికి బంగారు బాట వేస్తున్నామంటే... అది మనం చేసే చాలా పెద్ద తప్పు. వ్యక్తిగత దూషణకు గురైన ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 
 
అంతేగాకుండా అసెంబ్లీ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోలో రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం... దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేద్దాం. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా" అని జూనియర్ రాజకీయ నేతలకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్న ఎస్ఐ.. సస్పెన్షన్!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments