Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఘటనపై Jr. ఎన్టీఆర్!.. ఇక ఆ సంస్కృతిని ఆపేద్దాం..

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (16:15 IST)
అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానించారని.. ప్రెస్ మీట్‌లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. ఈ ఘటనపై బాబుకు పలువురు సంఘీభావం చెప్తున్నారు. అంతేగాకుండా నందమూరి ఫ్యామిలీ ఆయనకు వెన్నంటి వుండి.. ఈ చర్యకు తీవ్రంగా ఖండించింది.

తాజాగా అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని గుర్తు చేశారు. మన నవనాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సాంప్రదాయం అది అని చెప్పారు. 
 
మన సాంప్రదాయాలను జాగ్రత్తగా, భద్రంగా రాబోయే తరాలకు అప్పజెప్పాలే కానీ... మన సంస్కృతిని కాల్చివేస్తూ రాబోతే తరానికి బంగారు బాట వేస్తున్నామంటే... అది మనం చేసే చాలా పెద్ద తప్పు. వ్యక్తిగత దూషణకు గురైన ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 
 
అంతేగాకుండా అసెంబ్లీ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోలో రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం... దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేద్దాం. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా" అని జూనియర్ రాజకీయ నేతలకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments