Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ వేదికపై ఇద్దరు భారతీయులు కనిపించారు.... ఎన్టీఆర్

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (09:58 IST)
ఆస్కార్ వేదికపై తనకు ఇద్దరు భారతీయులు.. ఇద్దరు తెలుగు వారు కనిపించారని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. విష్వక్సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం "దాస్ కా ధమ్కీ" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ, "ఆర్ఆర్ఆర్" చిత్రం ఈ రోజున ప్రపంచపటంలో నిలవడానికి, ఆస్కార్ అవార్డును కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి ఎంత కారణమో, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఎంత కారణమో ఆ పాటను ఆదరించిన ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు, వారి అభిమానం అంతే కారణమన్నారు. 
 
"ఆ అవార్డును సాధించింది మీరే.. మీ అందరి బదులుగా మేం అక్కడికి వెళ్లాం. మా అందరి బదులుగా కీరవాణి, చంద్రబోస్‌లు వేదికపై నిల్చొన్నారు. ఆ స్టేజ్‌పై తనకు కీరవాణి - చంద్రబోస్‌లు కనిపించలేదు. ఇద్దరు భారతీయులు కనిపించారు. ఇద్దరు తెలుగువారు కనిపించారు. వేదికపై తెలుగుదనం ఉట్టిపడింది" అని అన్నారు. 
 
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన మీకు ఎలా అనిపించిందోగానీ రెండు నేత్రాలతో ప్రత్యక్షంగా చూడటం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. మళ్లీ అంతటి అనుభూతిని ఎప్పటికి పొందుతామో తెలియదు. 'ఆర్ఆర్ఆర్' ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమా మరింత ముందుకుసాగాలని ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments