బాహుబలిపై జేపీ ప్రశంస.. నా పనైపోయిందన్న రాజమౌళి.. డబ్బుల్లేక కష్టపడిన ప్రభాస్

బాహుబలి ది బిగినింగ్‌‌కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి 2 సినిమాపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసలు కురిపించారు. బాహుబలి 2 అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడుకున్నదని.. డైరెక్టర్ ఎస్ఎస్ రా

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (12:16 IST)
బాహుబలి ది బిగినింగ్‌‌కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి 2 సినిమాపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసలు కురిపించారు. బాహుబలి 2 అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడుకున్నదని.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారత సినీ పరిశ్రమను ప్రపంచ పటంలో ఉంచారని ట్వీట్ చేశారు జేపీ. కీరవాణి సంగీతం స్పూర్తి దాయకం. రమ, వల్లి, మూవీ యూనిట్ ఏళ్ల తరబడి కష్టపడి మాస్టర్‌పీస్‌ను రూపొందించారన్నారు.
 
ఇదిలా ఉంటే.. 'బాహుబలి-2' చివరి ప్రమోషన్ ఈవెంట్ లండన్‌లో ముగిసింది. ఈ సినిమా కోసం దర్శకదిగ్గజం రాజమౌళి ఐదేళ్లపాటు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజమౌళి ట్వీట్ చేశాడు. "లండన్‌లో జరిగిన ఈ చివరి ప్రమోషన్ ఈవెంట్‌తో... బాహుబలి సినిమా సిరీస్‌తో తన పని ముగిసిపోయింది" అని తెలిపాడు. 'మై జాబ్ ఈజ్ కంప్లీట్లీ ఓవర్' అని చెప్పాడు. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
 
ప్రభాస్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభాస్‌కు బాహుబలిలో నటిస్తుండగా మంచి ఆఫర్లు వచ్చాయి. నిర్మాతలు ఎందరో చెక్కులతో వచ్చారు. కానీ ప్రభాస్ అందుకు నిరాకరించాడు. ఆ సమయంలో చేతిలో డబ్బుల్లేకుండా కష్టపడేవాడు. అయినా పట్టించుకోకుండా తన పనిని పూర్తి చేశాడని రాజమౌళి ప్రభాస్‌ను కొనియాడాడు. అంతేకాదు.. రూ.10 కోట్ల విలువైన ఎండార్స్‌మెంట్ చేతికొచ్చినా తిరస్కరించాడు. అతడికి అబద్ధమాడడం తెలియదు. ఇతరుల సెంటిమెంట్‌ను హర్ట్ చేయడం అతడికి రాదని ప్రభాస్ తెలిపారు.  ఇతరులు బాధ పడితే ప్రభాస్ చూడలేడని రాజమౌళి తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments