Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగపతి బాబు పాదయాత్ర... రాజకీయ అరంగేట్రం చేస్తారా?

లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబుకు నంది అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. నంది అవార్టులపై వస్తున్న విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ''అది మీ ప్రాబ్లమ్ కానీ మా ప్రాబ్లమ్ కాదు'' అంటూ జ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (11:08 IST)
లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబుకు నంది అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. నంది అవార్టులపై వస్తున్న విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ''అది మీ ప్రాబ్లమ్ కానీ మా ప్రాబ్లమ్ కాదు'' అంటూ జగపతిబాబు దాటేశాడు. లెజెండ్ సినిమాలో విలన్‌గా చేశాను. తాను నటించిన మొదటి చిత్రం సింహస్వప్నం సినిమా మూడు రోజలు ఆడింది. లెజెండ్ మూడు సంవత్సరాలు ఆడింది. నంది అవార్డ్ కూడా వచ్చింది. సంతోషంగా ఉందని జగపతిబాబు చెప్పారు. 
 
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో ''లెజెండ్'' సినిమాకుగానూ ఉత్త‌మ విల‌న్‌గా జ‌గ‌ప‌తి బాబు ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా త‌న‌కు అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల జ‌గ‌ప‌తి బాబు హర్షం వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని కాళేశ్వర మార్కెట్ ప్రాంతంలో సోమవారం సిని నటుడు జగపతి బాబు అభిమానులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. చిన్న సినిమాలు అంతరించిపోకుండా విజయాలు సాధించాలని, చిత్ర పరిశ్రమకు కొత్తగా వస్తున్న కథానాయకులను, నాయికలను ప్రోత్సహించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. 
 
చిన్న సినిమాలకు థియేటర్లు, డిస్టిబ్యూటర్ల సమస్య ఎక్కువగా ఉందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగపతి బాబు ’హలో’, రంగస్థలం 198’, ‘సైరా నరసింహారెడ్డి’, ’జై సింహా’ తదితర చిత్రాలతో పాటు మలయాళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే జగపతిబాబు రాజకీయ అరంగ్రేటం కోసమే పంచెకట్టులో జగపతిబాబు ఇలా పాదయాత్ర చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments