Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా గీత గోవిందం వల్లే.. గీతా ఆర్ట్స్2 మీద ఐటీ దాడులు?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (15:42 IST)
గీతా ఆర్ట్స్ తాజాగా గీత గోవిందం సినిమాను తెరకెక్కించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కించారు. గీతా గోవిందం చిత్రం స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధించడం విశేషం. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా మారిపోయాడు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించగా, బన్నీ వాసు నిర్మించారు. 
 
ఈ నేపథ్యంలో గీతగోవిందం సినిమా వసూళ్ల లెక్కలు తేల్చేందుకు ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ 2 కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనే విషయంలో అధికారులు డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కాయి. 
 
ఇటీవల గీత ఆర్ట్స్ 2 పేరుతో మరో సంస్థని ప్రారంభించి అందులో సమర్పకుడిగా చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments