'బ్రహ్మోత్సవం' దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి మెగా కాంపౌండ్ కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది. ఆయనతో మెగా వారసుల్లో ఒకరు సినిమా చేస్తున్నట్లు తెలిసింది. బ్రహ్మోత్సవం ఫెయిల్కావడంతో.. మెగా కాంపౌండ్కు వెళ్ళడం ఆసక్తిగా మారింది.
తనవద్ద ఐదు కథలు సిద్ధంగా వున్నాయనీ.. త్వరలో వివరాలు చెబుతానని.. బ్రహ్మోత్సవం విడుదలకు ముందు దర్శకుడు చెప్పారు. అయితే.. గ్రౌండ్ వర్క్ మెగా కాంపౌండ్లో జరుగుతుందని ఫిలింనగర్ కథనాలు విన్పిస్తున్నాయి. అల్లు అరవింద్తో కలిసి శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని చెర్రీ హీరోగా నటిస్తారని తెలిసింది.