Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి - శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ. ఈ వార్త నిజ‌మేనా..?

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (21:50 IST)
మెగాస్టార్ చిరంజీవి – గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ అంటూ ఓ వార్త బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.  ఎప్ప‌టి నుంచో చిరు - శంక‌ర్ క‌ల‌యిక‌లో మూవీ వ‌స్తే చూడాల‌నివుంది అని చాలామంది అభిమానులు కోరుకున్నారు. రోబో ఫంక్ష‌న్‌కి చిరు ముఖ్య అతిధిగా హాజ‌రయ్యారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా ఉంటుంది అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కాంబినేష‌న్ సెట్ కాలేదు.
 
తాజా వార్త ఏంటంటే… మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్.. చిరు కోసం క‌థ రెడీ చేయ‌మ‌ని శంక‌ర్‌ని సంప్ర‌దించార‌ని.. శంక‌ర్ కూడా సానుకూలంగా స్పందించార‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం చిరు సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చేస్తున్నారు. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ మూవీ త‌ర్వాత చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. త్వ‌రలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని కూడా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నారు. చిరు త్రివిక్ర‌మ్‌తో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్ర‌చారంలో ఉన్న చిరు – శంక‌ర్ కాంబో మూవీ నిజ‌మా కాదా అనే విష‌యం పై చిరు కానీ శంక‌ర్ కానీ అల్లు అర‌వింద్ కానీ స్పందించ‌లేదు. మ‌రి..క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments