Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతగల పౌరులుగా నిబంధనలు పాటిద్దాం : తొలి ట్వీట్‌లో చెర్రీ పిలుపు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (16:08 IST)
మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో బాధ్యతగల పౌరులుగా రూల్స్‌ను తు.చ తప్పకుండా పాటిద్దామని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పిలుపునిచ్చారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాను గురువారం ప్రారంభించారు. ఇందులో తొలి పోస్టు చేస్తూ పైవిధంగా పిలుపునిచ్చారు. 
 
అలాగే, కరోనా బాధితుల సహాయార్థం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఇచ్చిన పిలుపుమేరకు తనవంతుగా ప్రధానమంత్రి సహాయనిధితో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు రూ.70 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 
 
అలాగే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. అందువల్ల మనవంతుగా బాధ్యతగల పౌరులుగా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాను @AlwaysRamCharan పేరుతో ప్రారంభించారు. ఈ ఖాతాకు ఇప్పటికే ఐదువేల మంది నెటిజన్లు ఫాలోయర్లుగా ఉన్నారు. కాగా, ఈయన తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు కొత్త సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని బుధవారం ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments