Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతగల పౌరులుగా నిబంధనలు పాటిద్దాం : తొలి ట్వీట్‌లో చెర్రీ పిలుపు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (16:08 IST)
మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో బాధ్యతగల పౌరులుగా రూల్స్‌ను తు.చ తప్పకుండా పాటిద్దామని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పిలుపునిచ్చారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాను గురువారం ప్రారంభించారు. ఇందులో తొలి పోస్టు చేస్తూ పైవిధంగా పిలుపునిచ్చారు. 
 
అలాగే, కరోనా బాధితుల సహాయార్థం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఇచ్చిన పిలుపుమేరకు తనవంతుగా ప్రధానమంత్రి సహాయనిధితో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు రూ.70 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 
 
అలాగే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. అందువల్ల మనవంతుగా బాధ్యతగల పౌరులుగా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాను @AlwaysRamCharan పేరుతో ప్రారంభించారు. ఈ ఖాతాకు ఇప్పటికే ఐదువేల మంది నెటిజన్లు ఫాలోయర్లుగా ఉన్నారు. కాగా, ఈయన తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు కొత్త సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని బుధవారం ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments