Webdunia - Bharat's app for daily news and videos

Install App

Immanuel vs Poorna- రష్మీకి ఏమైంది?

Webdunia
మంగళవారం, 31 మే 2022 (16:18 IST)
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ వారం యాంకర్ గా సుడిగాలి సుధీర్ కనిపించకపోవడంతో అతని స్థానంలో రష్మీ యాంకర్‌గా సందడి చేశారు.
 
ఇక ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్ పూర్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా పూర్ణ ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది రెచ్చిపోయి పూర్ణ గారు హగ్ కావాలని అడిగారు. దీంతో పూర్ణ ఈ హగ్గులు ఇవ్వలేక ఢీ వదిలి ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడానా అంటూ ఆది పై సెటైర్ వేశారు.
 
అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ వేసే మగవారిని వేదికపైకి ఆహ్వానించారు. అదేవిధంగా ప్రేక్షకుల సరదా కోసం తాము లేడీ గెటప్స్ వేయటం వల్ల సమాజంలో చులకన భావంతో చూస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇలా ఈ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఇమ్మానియేల్ హీరోయిన్ పూర్ణను తాకాడు. ఇమ్మానియేల్ ఇలాగ తనని తాకడంతో హీరోయిన్ పూర్ణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో రష్మీ అక్కడే నిలబడి ఉండగా ఒక్క సారిగా సొమ్మసిల్లి కిందపడిపోగా ఆటో రాంప్రసాద్ తన కింద పడిపోకుండా పట్టుకున్నారు. 
 
అయితే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా.. లేదా ఎపిసోడ్‌పై హైప్ పెంచడం కోసం ఇలా ప్రోమో కట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments