Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ తర్వాత మళ్లీ తెలుగులో దర్శనమిచ్చిన ఇలియానా..

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (10:57 IST)
తెలుగు సినిమాలలో ఇలియానా కనిపించి ఆరేళ్లు గడిచిపోయాయి. 2005 సంవత్సరంలో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా సుందరి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, నటిగా మంచి పేరు సంపాదించుకుంది. 2012లో రిలీజైన జులాయి, దేవుడు చేసిన మనుషులు చిత్రాలతో తెలుగు సినిమాకు బై చెప్పి, హిందీలో సినిమాల్లో నటించింది. అక్కడ కూడా మంచి నటిగా నిరూపించుకున్నప్పటికీ సినిమా అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. 
 
అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితంలోనూ తన బాయ్‌ఫ్రెండ్ విషయంలో బాగా పాపులారిటీ వచ్చింది. అయితే తాజాగా ఇలియానా మళ్లీ తెలుగులో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది. రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న "అమర్ అక్బర్ ఆంటోనీ"(ట్రిపుల్ ఏ) చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. రవితేజ, ఇలియానా ఇద్దరూ రెండు చిత్రాల్లో కలిసి నటించారు. 
 
వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఇది హ్యాట్రిక్ చిత్రంగా నిలవబోతోంది. పైగా రవితేజ - శ్రీనువైట్లది కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజైంది. ఈ చిత్రం నవంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రంగస్థలం' సినిమా విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments