Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు .. ఏంటది?

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (08:23 IST)
మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కోసం ఆయన్ను ఎంపిక చేశారు. దీన్ని కేంద్రం ప్రకటించింది. సోమవారం నుంచి గోవా వేదికగా జరిగే ఇఫీ (ఐఎఫ్ఎఫ్ఐ) చలనచిత్రోత్సవ వేడుకల్లో ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయడంపై చిరంజీవి స్పందించారు. 
 
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ చేసిన ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు. 
 
అంతకుముందు చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ అధికారికంగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదారణ పొందారని, హృదయాలను కలిగించే నటనా ప్రతిభ ఆయన సొంతమని కొనియాడుతూ, మెగాస్టార్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments