స్వామీ నిత్యానందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. ప్రియా ఆనంద్

Webdunia
శనివారం, 9 జులై 2022 (11:36 IST)
Nithyananda
హీరోయిన్ ప్రియా ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను వివాదాస్పద స్వామీ నిత్యానందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. 
 
స్వామి నిత్యానంద గురించి అందరికి తెలిసిందే. భారదేశంలో ఆశ్రమం నడిపి ప‌లు కేసుల్లో చిక్కుకోవడంతో దేశం విడిచిపోయాడు. ప్రస్తుతం ఎక్కడో ఓ దీవిని కొనుక్కొని కైలాస దీవి అని పేరు పెట్టుకొని అక్కడే ఉంటున్నట్టు ఆయనే తెలిపాడు. అక్క‌డ నుంచే సోష‌ల్ మీడియా ద్వారా త‌న భ‌క్తుల‌కు ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే తాజాగా ఈ స్వామీజీని పెళ్లి చేసుకోవాలి అని ప్రియా ఆనంద్ తెలిపింది. 
 
తెలుగులో లీడర్ సినిమాతో పరిచయం అయిన ప్రియా ఆనంద్ ఆ తర్వాత రామరామ కృష్ణకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాలతో మెప్పించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా తెలుగులో సుశాంత్ సరసన మా నీళ్ల ట్యాంకర్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్ త్వరలో జీ5 ఓటీటీలో టెలికాస్ట్ కానుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యూనిట్.
 
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రియా ఆనంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియా ఆనంద్‌ని ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడగగా ఆమె మాట్లాడుతూ.. "నేను నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. ఆయ‌న గురించి ఎలాంటి ప్ర‌చారం జరుగుతున్నా వేలాది మంది భ‌క్తులు ఆయ‌న్ని ఆరాధిస్తున్నారు. ఆయ‌న్ని పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు" అని తెలిపింది. 
 
అయితే ఇది సరదాగానే అన్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రియా ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments