చావు అంచుల వరకు వెళ్లివచ్చాం... : హీరోయిన్ సురభి

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (10:48 IST)
తనతో పాటు అనేక మంది ప్రయాణికులు చావు అంచుల వరకు వెళ్లి వచ్చామని హీరోయిన్ సురభి అంటున్నారు. బీరువా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌లలో పాటు పలు చిత్రాల్లో నటించారు. తాజాగా తనకు ఎదురైన ఓ సంఘటన గురించి మాట్లాడుతూ, తాను చావు నుంచి తృటిలో తప్పించుకున్నట్టు చెప్పారు. ఇదివరకెన్నడూ ఎదురుకాని ఒక ఘటన ఆదివారం ఎదురైందన్నారు. తాను ప్రయాణించిన ఓ విమానం సాంకేతిక లోపానికి గురై, ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. విమానం పైలెట్ నియంత్రణలో లేకుండా పోయిందని, ఆ సమయంలో బాగా వేసిందని ఆమె చెప్పారు. అయితే, పైలెట్ తెలివైన నిర్ణయం కారణంగా అంతా ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డామని తెలిపారు. 
 
చావు అంచుల వరకు వెళ్లొచ్చామనే భావన ప్రతి ఒక్కరికీ కలిగిందన్నారు. ఆ ఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నారు. తాను ఈ రోజు ఇలా బతికుండటంతో తనలోని సానుకూల దృక్పథం పట్ల మరింత నమ్మకం కలిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఏ విమానం, ఎక్కడికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments