Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదం జరిగినపుడు రక్తం చుక్క కూడా రాలేదు : అల్లు అరవింద్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (15:02 IST)
గతంలో హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఆయన బైకుపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ అయిందన్న వార్త తెలియగానే తాను హుటాహుటిన ప్రమాదం స్థలానికి చేరుకున్నాను. అపుడు సాయిని చూసి నాకు చాల భయం వేసింది. రక్తం చుక్క కూడా రాలేదు.. ఏం జరిగిందో తెలియడానికి పావుగంట పట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి అతడు బయటపడినందుకు చాలా ఆనందంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం "విరూపాక్ష". ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరిగింది. ఇందులో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ ప్రమాదం గురించి మాట్లాడారు. 
 
ఇకపోతే, సాయిధరమ్‌ తేజ్‌ కూడా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. 'యాక్సిడెంట్‌ ప్రభావం సినిమాలపై పడుతుందని కొందరు అనుకున్నారు. అసలు ఆ యాక్సిడెంట్‌ సంగతే నేను మర్చిపోయాను. అది ఒక స్వీట్‌ మెమొరీ కింద లాక్‌ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఇకపై గ్యాప్ తీసుకోను.. వరసగా సినిమాలు చేస్తాను' అని ఈ యంగ్‌ హీరో చెప్పారు. కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన 'విరూపాక్ష'లో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఈ నెల 21వ తేదీన విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments