చెర్రీ-ఎన్టీఆర్-రాజమౌళి చిత్రంలో నేనా... నాని ప్రశ్న

బాహుబలి అఖండ విజయం తర్వాత దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం ఏంట‌నేది అభిమానుల‌కి ఓ క్లారిటీ వ‌చ్చింది. డీవీవీ దాన‌య్య నిర్మాణంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ముగ్గురు టైటాన్స్ అపూర్

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:04 IST)
బాహుబలి అఖండ విజయం తర్వాత దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం ఏంట‌నేది అభిమానుల‌కి ఓ క్లారిటీ వ‌చ్చింది. డీవీవీ దాన‌య్య నిర్మాణంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ముగ్గురు టైటాన్స్ అపూర్వ కలయికకు ప్రతిబింబం అంటూ టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు. అయితే ఈ చిత్రం ఎనౌన్స్ అయిన‌ప్ప‌టి ద‌గ్గ‌రి నుండి ఇందులో ప‌లు పాత్ర‌ల‌కి సంబంధించి రూమ‌ర్స్ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. 
 
విల‌న్ పాత్రకి యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్‌ని తీసుకున్నార‌ని ఆమ‌ధ్య పుకార్లు షికారు చేయ‌గా, దీనిని జీవిత ఖండించారు. ఆ త‌ర్వాత నాని ఓ ముఖ్యమైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు నాని. కృష్ణార్జున యుద్ధం చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్ర‌శ్న‌కి నాని బ‌దులిస్తూ.. ఎన్టీయార్‌-చ‌ర‌ణ్ సినిమాలో నేను న‌టించ‌డం లేదు. అది పూర్తిగా చ‌ర‌ణ్‌-ఎన్టీయార్ సినిమానే. 
 
అలాగే త్రివిక్ర‌మ్‌, సుకుమార్ సినిమాల్లో కూడా న‌టిస్తున్నాన‌ని రాస్తున్నారు. అవేవి నిజం కాదు. క‌లిసి ప‌నిచేయాల‌ని మాకు ఉంది. క‌లిసిన‌పుడు మాట్లాడుకుంటాం. ఇంకా ఏదీ ఫైన‌ల్ కాలేదని అన్నాడు. నాని తాజా చిత్రం ఏప్రిల్ 12న విడుద‌ల కానుండ‌గా ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments