Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని నాగార్జున 'వరద సాయం' రూ.50 లక్షలు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (14:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. అలాగే, అపార నష్టం వాటిల్లింది. ఈ వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. వరద ముప్పు కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే, తక్షణ సాయం కింద రూ.550 కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. 
 
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రూ.50 లక్షల విరాళం అందించేందుకు ముందుకు వచ్చారు. 
 
భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల‌న హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల జీవితం దుర్భ‌రంగా మారింది. వారి బాగోగుల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ సాయం కింద రూ.550 కోట్లు విడుద‌ల చేయ‌డం హ‌ర్ష‌ణీయం. ఈ విప‌త్తు వ‌ల‌న నిరాశ్ర‌యులైన వారికి నా వంతు సాయంగా రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నాను అని నాగార్జున పేర్కొన్నారు.


అలాగే, టాలీవుడ్ కుర్రహీరో విజయ్ దేవరకొండ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. గతంలో కేరళ, చెన్నై నగరాల్లో వరదలు సంభవించినపుడు మనమంతా ఒక్కటిగా నిలిచామని, ఇపుడు హైదరాబాద్ నగరాన్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం