Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ కేసు: వర్మను అరెస్ట్ చేస్తారా? రెండేళ్ల నుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది అతనిపైనే ఆధారపడి వుంటుందని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. ''జీఎస్టీ'' వెబ్ చిత్రం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (16:42 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది అతనిపైనే ఆధారపడి వుంటుందని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. ''జీఎస్టీ'' వెబ్ చిత్రం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అశ్లీలతపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అలాగే ఈ సినిమాలో మహిళలను కించపరిచారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ కేసుపై విచారణ నిమిత్తం వర్మ సీసీఎస్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనతో పాటు అడ్వొకేట్ కూడా వచ్చారు. 
 
విచారణలో వీరిద్దరే పాల్గొన్నారని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. వర్మ వద్ద పూర్తి స్థాయిలో విచారణ జరిపామని తెలిపారు. సామాన్య వ్యక్తిగానే వర్మను పరిగణిస్తామని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సినిమాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్, మహిళలను కించపరిచేలా మాట్లాడారనే దానికి సంబంధించి మరొక ఎఫ్ఐఆర్ ఆయనపై నమోదయ్యాయని.. ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాతే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 
వర్మ కేసు సాధారణమైంది కాదని, ఒకవేళ వర్మ దోషిగా తేలితే.. రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుందన్నారు. టెక్నికల్‌గా చాలా ఆధారాలను సేకరించాల్సి వుందన్నారు. జీఎస్టీలో అశ్లీలత, మహిళలపై అభ్యంతరకరమైన కామెంట్స్ సంబంధించి శనివారం వర్మ వద్ద విచారణ పూర్తయ్యింది. మూడున్నర గంటల సేపు ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వర్మను 25 ప్రశ్నలేశారని సమాచారం. విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. వచ్చే శుక్రవారం కూడా మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను పోలీసులు సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments