Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (14:07 IST)
'పుష్ప-2' మూవీ ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ ఏ11 నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 
 
కాగా, తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఆయన తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు ఈ నెల 13న విధించిన 14 రోజుల రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో బన్నీ శుక్రవారం వర్చువల్‌గా న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. 
 
మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్టు ప్రకటించింది. అదే రోజు బన్నీ రిమాండ్‌పైనా కూడా విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments