రాజకీయ నాయకులపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

డీవీ
శనివారం, 20 ఏప్రియల్ 2024 (18:42 IST)
Hero Vishal
తమిళ, తెలుగు కథానాయకుడు విశాల్ పలు సేవాకార్యకమాలు చేస్తూనే నటుడిగా కొనసాగుతూ వున్నారు. తాజాగా ఆయన నటించిన సినిమా రత్నం. త్వరలో విడుదలకాబోతుంది. హైదరాబాద్ వచ్చిన ఆయన రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన మాటల్లో... దయచేసి మే 13న కొత్త ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలి. తమిళనాడులో నా ఓటు నేను వేశాను. తమిళనాడులో 70 శాతం ఓటింగ్ నమోదైంది, ఇంకో 20 శాతం పోలైతే విప్లవాత్మకమయ్యేది.  తమిళనాడులో ఓటింగ్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలి.
 
శుక్రవారం కాకపోతే మరో శుక్రవారం సినిమా చూడొచ్చు.  ఓటు మాత్రం ఒక రోజు మాత్రమే వేయగలం.  ఐదు సంవత్సరాలకోసారి ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చుకోవాలి. నమ్మిన వాళ్లకు ఓటు వేయండి.  ఓటు వేయించుకున్న వాళ్లు చేయాల్సిన బాధ్యత చేయాలి. 
 
నేను ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేయమని చెప్పను. ఎవరిని కించపరిచేలా మాట్లడటం నాకు ఇష్టం ఉండదు.  నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటాను. 
 
తమిళనాడులో ఇంకో జెండా, ఇంకో నాయకుడు రాకూడదనుకుంటాను. రాజకీయ నాయకులు వాళ్ల పని సరిగ్గా చేస్తే మరో పార్టీ , ఇంకో నాయకుడు పుట్టడు. రాజకీనాయకులు నటులుగా మాట్లాడుతుంటే నటులు రాజకీయ నాయకులవుతున్నారు. 
 
రాజకీయం అనేది సమాజ సేవ.  నేను అమ్మ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాను.  మా స్వచ్చంద సంస్థ ద్వారా తెలియని వ్యక్తులకు సాయం చేయడం మా ఏజెండా.  రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయడం ఎజెండాగా ఉండాలి.  ప్రజలు బెంజ్ కార్ అడుగుతారా?  బంజారాహిల్స్ లో ఇళ్లు అడుగుతున్నారా ?
తాగడానికి మంచినీళ్లు, విద్య, వైద్యం, బతకాలని ప్రజలు అడుగుతారు. 
 
నేను ఇప్పుడు ఒక ఓటరును మాత్రమే.  నేను ఏ రాజకీయ నాయకుడితో కలిసి పనిచేయను, ఏ పార్టీలో కలిసిపోను అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments