Webdunia - Bharat's app for daily news and videos

Install App

భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారు: హీరో శివాజీ

ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు. తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగ

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (10:17 IST)
ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు.  తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. టీడీపీకి చెందిన వారికే అవార్డులు ఇవ్వ‌డం న్యాయం కాదని మండిప‌డ్డారు. తనకు ఇలాగే గతంలో అన్యాయం జరిగిందన్నారు.
 
గ‌తంలో తాను న‌టించిన‌ మిస్స‌మ్మ సినిమా బాగా ఆడింద‌ని, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంద‌ని కానీ అవార్డు రాలేదన్నారు. మిస్స‌మ్మ సినిమాకు త‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ఇవ్వాల‌ని 90 శాతం మంది క‌మిటీ స‌భ్యులు ఎంపిక చేస్తే కొంద‌రు అడ్డుకున్నారని, త‌న‌కు ఈ విష‌యంపై ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని గుర్తు  చేశారు. 
 
సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భ‌జ‌న చేసి అవార్డులు తీసుకుంటున్నార‌ని విమర్శలు గుప్పించారు. అవార్డులు ఇవ్వాలంటే ఓ కమిటీ వేసి.. ప్రజల అభిప్రాయం సేకరించాకే అవార్డులు ఇవ్వాలని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments