Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సాయిరామ్ శంకర్ "నేనోరకం" .. మార్చి 17న రిలీజ్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'నేనోరకం'. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (10:11 IST)
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'నేనోరకం'. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటలను పూరి జగన్నాథ్, దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్, శర్వానంద్ ఒక్కొక్కరిగా ఒక్కొక్క పాటను త్వరలో ఆవిష్కరించబోతున్నారు. మార్చి 17న సినిమా విడుదలకు సిద్దమవుతోంది. 
 
ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. 'నేనోరకం' అనే టైటిల్ మా ఈ సినిమాకు కరెక్ట్‌గా యాప్ట్. ఆడియెన్స్‌ను అలరించటంతోపాటు, ఆలోచింపజేసేలా, కాంటెంపరరీ ఇష్యూస్‌ను స్ఫూర్తిగా తీసుకొని, ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబడిన చిత్రమిదన్నారు.
 
శరత్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా సౌత్‌లో అందులోనూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. 'నేనోరకం' సైతం అదే కోవలో వస్తున్న ట్రెండీ మూవీ. దర్శకుడి కథ, కథనమే ఈ సినిమాకు హైలెట్. సినిమా టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకువస్తుందన్నారు.
 
దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ మహిత్ అందించిన పాటలను టాప్ సెలబ్రెటీస్ త్వరలో ఆవిష్కరించబోతున్నారు. "నేనోరకం" టైటిల్‌కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో సినిమా రూపొందించటం జరిగింది. సాయిరామ్ శంకర్ - శరత్ కుమార్‌ల నటన, వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్‌కు సరికొత్త థ్రిల్‌ను కలుగచేస్తాయన్నారు.
 
నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మా సంస్థ ద్వారా వస్తొన్న తొలి చిత్రన్నే ఓ సరికొత్త కమర్షియల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఆడియోన్స్‌తో పాటు, క్రిటిక్స్‌ను కూడా అలరించేలా ఈ సినిమాను సిద్ధం చేయటం జరిగింది. మార్చి 17న సినిమా విడుదలవుతుందన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments